
రాష్ట్ర సమాచార హక్కుచట్టం కమిషనర్ల నియామకానికి గవర్నర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. పీవీ శ్రీనివాస్రావు, పర్విన్ మోహిసిన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్యరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులను జారీచేసింది. సీఎం కార్యాలయంలో సీపీఆర్వోగా పనిచేస్తున్న బోరెడ్డి అయోధ్యరెడ్డి ఎంపికపై దుమారం రేగుతున్నది. ఆయన కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. పూర్తిస్థాయిలో రాజకీయ నేపథ్యం ఉన్నది. పక్కా రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తిని సమాచార కమిషనర్గా ఎలా నియమిస్తారని పలువురు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు.