ఐపీఎల్-19లో పంజాబ్ కింగ్స్కు ఎదురుదెబ్బ తగిలింది. ఎదురైన ప్రత్యర్థినల్లా ఓడిస్తున్న పంజాబ్కు సొంత మైదానంలో రాజస్థాన్ రాయల్స్ ఊహించని పంచ్ ఇచ్చింది. ముల్లన్పూర్లో నిర్దేశించిన 223 పరుగుల ఛేదనను రాజస్థాన్ రాయల్స్ ధాటిగా మొదలెట్టింది. తొలి ఓవర్లోనే అర్ష్దీప్ సింగ్కు చుక్కలు చూపిస్తూ వైభవ్ సూర్యవంశీ(43) 6, 4, 4 బాదాడు. అనంతరం యాన్సెన్, ఫెర్గూసన్ ఓవర్లోనూ వైభవ్ విధ్వంసంతో 20 బంతుల్లోనే 51 పరుగులు చేసింది రాజస్థాన్.

