
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై గుర్తుతెలియని వ్యక్తి దాడికి దిగడం కలకలం రేపింది. ఈ దాడిని ఆమె పిరికిపంద చర్యగా అభివర్ణించారు. తాను కోలుకుంటున్నానని, త్వరలోనే విధుల్లోకి వస్తానని సీఎం తెలిపారు. దాడి వెనుక కుట్ర ఉందని సీఎం కార్యాలయం అనుమానిస్తోంది. గుజరాత్కు చెందిన రాజేశ్ సకారియా దాడికి పాల్పడ్డాడు. జైలులో ఉన్న బంధువును విడిపించేందుకే దాడి చేశాడని భావిస్తున్నారు. ఈ ఘటన తన సంకల్పాన్ని అడ్డుకోలేదని, మరింత నిబద్ధతతో పనిచేస్తానని రేఖా గుప్తా స్పష్టం చేశారు.