ఐపీఎల్ ఏడవ మ్యాచ్లో, సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉత్కంఠ విజయం సాధించింది. హైదరాబాద్ అందించిన 227 పరుగుల టార్గెట్ ను కోల్కతా నైట్ రైడర్స్ చేరుకోలేకపోయింది. ఇషాన్ మలింగ ఒకే ఓవర్లో సునీల్ నరైన్, రమన్దీప్ సింగ్లను అవుట్ చేసి షాకిచ్చాడు. సన్రైజర్స్ హైదరాబాద్ పవర్ప్లేలో 84 పరుగులు చేసిన తర్వాత, ఎస్ఆర్హెచ్ 10 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయింది. హెన్రిచ్ క్లాసెన్ అర్ధశతకం సాధించి జట్టును 226 పరుగులకు చేర్చాడు.

