తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 11, గురువారం నాడు జరగనుంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.గురువారం జరగబోయే పోలింగ్ కోసం ఇప్పటికే మండల కేంద్రాలకు బ్యాలెట్ పేపర్లు, బాక్సులు పంపించారు. 5 చోట్ల అసలు నామినేషన్ దాఖలు కాలేదు. మరో 395 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇవి మినహా మిగిలిన 3,836 సర్పంచ్ స్థానాలకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి.

