
తెలంగాణలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఫీజులు పెంచాలంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ఫీజుల పెంపు విషయంలో ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఫీజుల నియంత్రణ కమిటీ (TAFRC)ను ఆదేశించింది. 6 వారాల్లోగా ఈ వ్యవహారంపై కమిటీ స్పష్టత ఇవ్వాలని హైకోర్టు సూచించింది. ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపైనే ఫీజుల పెంపు అమలవుతుందని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.