
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సుమారు సాయంత్రం5గంటల సమయంలో గోపాల్పూర్ సమీపంలో ఒడిశా తీరాన్ని దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గడిచిన 6గంటల్లో గంటకు 17కి.మీ వేగంతో కదిలిందని చెప్పింది. ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయంకి క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వెల్లడించింది. కాగా.. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తరాంధ్రలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.