
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజినోవా తిరుమల తిరుపతి లో శ్రీవారిదర్శనం చేసుకున్నారు. అంతకు ముందు ఆమె గుండుచేయించుకుని, శ్రీవారికి తలనీలాల మొక్కులు కూడా చెల్లించుకున్నారు. సింగపూర్ లో అగ్నిప్రమాదం నుంచి తన తనయుడు మార్క్ శంకర్ బయటపడటంతో ఆమె తన మొక్కులు చెల్లించుకున్నారు. సాధారణ భక్తుల్లాగానే కళ్యాణకట్టకు వెళ్లి తలనీలాలు సమర్పించుకున్నారు అన్నాలెజినోవా, పవన్ కళ్యాణ్ భార్య వచ్చారని తెలిసి ఆమెను చూడటానికి భక్తులు ఎగబడ్డారు.