మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కాగా తాజాగా ఈ చిత్ర షూటింగ్కు ఓ చిన్న బ్రేక్ వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్తో భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు ప్రశాంత్ నీల్. దానికి సంబంధించిన షూటింగ్ వరుసగా జరిగింది. ఈ చిత్రీకరణ సమయంలోనే ఎన్టీఆర్ అస్వస్థతకు గురయ్యారు. వరుసగా షూటింగ్లో పాలుపంచుకోవడం వల్ల, వాతావరణం సరిగా లేక ఎన్టీఆర్ కు అనారోగ్యం వాటిల్లిందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

