
నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతాన్ని భూ ప్రకంపనలు వదలడం లేదు. శుక్రవారం సాయంత్రం మరోసారి భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్పై తీవ్రత 3.7గా నమోదు అయింది. భూకంప కేంద్రం హర్యానా ప్రాంతంలో ఉన్నట్లుగా గా గుర్తించారు. ఈ భూకంపం స్వల్ప తీవ్రత కలిగి ఉన్నప్పటికీ, ప్రకంపనలు స్పష్టంగా గమనించేలా ఉన్నాయని పలువురు సోషల్ మీడియాలో స్పందించారు. గురుగ్రామ్, నోయిడా, ఢిల్లీలోని హై-రైజ్ భవనాలలో నివసించే వారు బలమైన ప్రకంపనలకు భయపడ్డారు.