వాయు కాలుష్యం కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే కృత్రిమ వర్షం కురిపించేందుకు సిద్ధమైంది. సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్ లాంటి రసాయన ఉత్ప్రేరకాలను IIT కాన్పూర్కు చెందిన విమానం ద్వారా మేఘాలపై చల్లి ఈ ప్రక్రియను పూర్తి చేసింది. మరికాసేపట్లో ఢిల్లీలో కృత్రిమ వర్షం కురిసే అవకాశం ఉంది. ఢిల్లీలోని ఖేక్రా, బురారి, మయూర్ విహార్ సహా పలు ప్రాంతాల్లో క్లౌడ్ సీడింగ్ నిర్వహించినట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు.

