
శ్రీకాళహస్తికి చెందిన రాజకీయ నాయకురాలు, జనసేన బహిష్కృత నేత వినుత కోటకు బెయిల్ మంజూరు అయింది. తన వద్ద డ్రైవర్గా పనిచేసిన రాయుడు హత్య కేసులో వినుత కోట ఏ3గా ఉన్నారు. ఈ కేసులో వినుత కోటకు మద్రాస్ చీఫ్ సెషన్స్ కోర్టు బెయిల్ ఇటీవల మంజూరు చేసింది. అయితే ప్రతిరోజు ఉదయం 10 గంటలలోపు సీ3 సెవెన్ వెల్స్ పోలీసు స్టేషన్లో సంతకం చేయాలని షరతు విధించింది.