భారత కరెన్సీ రూపాయి శుక్రవారం చారిత్రక పతనాన్ని నమోదు చేసింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఇంట్రాడే ట్రేడింగ్లో 94.85 స్థాయికి పడిపోయి కొత్త ఆల్ టైమ్ కనిష్ఠాన్ని తాకింది. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఈ పతనానికి ప్రధాన కారణాలుగా మారాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి రూపాయి సుమారు 0.9 శాతం నష్టంతో 94.81 వద్ద స్థిరపడింది. ఇది కూడా రూపాయి చరిత్రలోనే అత్యల్ప ముగింపు స్థాయి కావడం గమనార్హం.

