
రాష్ట్రంలో పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతీ ఒక్క విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పూర్తి చేయాలని సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ఆ విధంగా అవకాశాలు కల్పించి అమలు జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఇతర రాష్ట్రాల్లో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉంటుంది. అందువల్ల ఆ రాష్ట్రాల్లో డ్రాపౌట్స్ సంఖ్య తక్కువగా ఉంది,ఈ విధానంపై సమగ్ర నివేదిక సమర్పించాలి” అని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.