
ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది.. మహానాడు జరిగిన పది రోజులకే సీనియర్ నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. 2024 ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేశారు. రాజంపేట టీడీపీలో గ్రూప్ వార్ నడుస్తుండటం, పాలకొండ్రాయుడు మరణంపై చంద్రబాబు స్పందించకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.