
ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో జైషే మహమ్మద్ సంస్థ చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులతోపాటు అతడి సన్నిహితులు మొత్తం 14 మంది మరణించారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్ దాడుల్లో చనిపోయిన మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకుంది మృతులు ఒక్కొక్కరికి రూ. కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.