
జనసేన ఎంపీ, టీ టైమ్ యజమాని తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.92.5 లక్షలు కొల్లగొట్టారు. ఎంపీ పేరుతో వాట్సాప్ ద్వారా టీ టైమ్ సీఎఫ్వో శ్రీనివాసరావును మోసగించారు. ఎంపీ ప్రొఫైల్ పిక్చర్ పెట్టి డబ్బులు కావాలని
మెసేజ్ చేయడంతో నమ్మి రూ.92.5 లక్షలు పంపారు. మోసం తెలుసుకుని సీఎఫ్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు.