శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని హిల్వ్యూ ఆడిటోరియంలో శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ మంత్రి నారా లోకేశ్, తమిళనాడు మంత్రి శేఖర్బాబు తదితరులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అంతకుముందు స్వర్ణ రథంపై సత్యసాయి చిత్రపటాన్ని
ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకువచ్చారు. కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి.

