
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం మండలం కమిని లంక సమీపంలో విషాదం చోటు చేసుకుంది. కె.గంగవరం మండలం శేరుల్లంక గ్రామంలో ఓ శుభకార్యానికి వివిధ ప్రాంతాల నుంచి యువకులు వచ్చారు. యువకులు సరదాగా గోదావరి గట్టుకు వెళ్లారు. ఈత సరదాతో గోదావరిలో దిగారు. దాదాపు 11 మంది యువకులు స్నానానికి వెళ్లారు. వెళ్లిన కాసేపటికే 8 మంది కొట్టుకుపోయారు. జిల్లా కలెక్టరుతో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. గాలింపు చర్యలు జరుగుతున్న తీరును సీఎం చంద్రబాబుకు కలెక్టర్ వివరించారు.