<span;>జనవరి 7 నుంచి మెగా టోర్నీ మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్కు సంబంధించి ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కొత్త కెప్టెన్ను ప్రకటించింది. మెగ్ లానింగ్ యుగానికి ముగింపు పలుకుతూ.. భారత మహిళల స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ కు ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది ఆ ఫ్రాంచైజీ. మెగ్ లానింగ్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడు సీజన్లలో ఫైనల్స్కు చేరింది. కానీ కప్పు అందుకోలేకపోయింది.

