
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.. అంతేకాకుండా కొత్త రూపంలో పంజా విసురుతోంది.. NB 1.8.1, LF.7.. ఈ రెండు కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం నిపుణులు గుర్తించారు. అయితే.. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటకలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. మహారాష్ట్ర థానేలో కొవిడ్తో 21 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.. బెంగళూరులో కరోనాతో 84 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు.