
ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏపీ ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారా? అని ప్రశ్నించారు. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదని స్పష్టం చేశారు.