రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కదులుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. దాంతో పది నుంచి 12 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. వివరాల్లోకి వెళితే.. జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వెళ్తున్న ప్రైవేటు బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలు, నలుగురు మహిళలు ఉన్నట్లుగా తెలుస్తున్నది జైసల్మేర్-జోధ్పూర్ హైవేలోని థైయత్ గ్రామం సమీపంలో మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 57 మంది ప్రయాణికులు ఉన్నారు.

