అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఓ వృద్ధురాలు బస్సులోకి ఎక్కింది, అప్పటికే బస్సు మొత్తం నిండిపోయి ఉంది. బస్ కండక్టర్ సీటు ఒక్కటి ఖాళీగా ఉండటంతో.. బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి.. వృద్ధురాలిని కండక్టర్ సీట్లో కూర్చోమని సూచించాడు. వృద్ధురాలిని తన సీట్లో కూర్చోమని సూచించినందుకు బస్సు కండక్టర్, ఆ ప్రయాణికుడితో గొడవకు దిగాడు. దీంతో ఆ ప్రయాణికుడు, కండక్టర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన కండక్టర్.. అసభ్య పదజాలంతో దూషిస్తూ సదరు ప్రయాణికుడిపైకి దూసుకెళ్లేందుకు యత్నించాడు.

