
ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తన ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టి పెట్టింది. ఉద్యోగులు పని గంటలు అయ్యాక అదనంగా పని చేయొద్దని సూచిస్తూ వ్యక్తిగత ఈ-మెయిల్స్ పంపుతోంది. పని వేళలు ముగిసిన వెంటనే విశ్రాంతి తీసుకోవాలని చెబుతోంది. అయితే, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి గతంలో వారానికి 70 గంటలు పని చేయాలని చేసిన వ్యాఖ్యలు మళ్లీ చర్చకు వచ్చాయి.