
రాహుల్ గాంధీ, ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ” ఓట్ల దొంగతనం”లో పాలు పంచుకుందని ఆరోపించారు. ఈ ఆరోపణలకు సంబంధించి విపక్షాలు నిర్వహించిన స్వతంత్ర దర్యాప్తులో “పక్కా సాక్ష్యాలు” లభించాయన్నారు. ఇవి బయట పెడితే “అణుబాంబు” స్థాయిలో రియాక్షన్ వస్తుందని, ఈ సాక్ష్యాలు బహిర్గతమైతే ECIకి దాక్కునే అవకాశం ఉండదని హెచ్చరించారు. ECI, రాహుల్ గాంధీ ఆరోపణలను “ఆధారరహితం” , “బాధ్యతారహితం” అని తీవ్రంగా ఖండించింది. “రోజువారీ ఆధార రహిత ఆరోపణలను” ECI పట్టించుకోదన్నారు.