ఓట్ల చోరీ విషయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్ షాలు దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా చివరకు దొరికిపోతారని కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బిహార్లోని కిషన్గంజ్లో జరిగిన ర్యాలీలో అన్నారు. బిహార్లో 100శాతం ఇండియా కూటమి అధికారం చేపడుతుందని చెప్పారు. బీజేపీ, ఆరెస్సెస్లు దేశాన్ని విభజించేందుకు యత్నిస్తున్నాయని, మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటకల్లో ఓట్ల చోరీపై ఆధారాలు చూపించామని కానీ ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్లు ఆ విషయంపై స్పందించలేదని పేర్కొన్నారు.

