త్వరలోనే నరసాపురం రైల్వే స్టేషన్కు వందేభారత్ రైలు రానుంది. చెన్నై సెంట్రల్ – విజయవాడ మధ్య నడుస్తున్న వందేభారత్ రైలును నరసాపురం వరకు పొడిగిస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ సర్వీసు ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది. చెన్నై సెంట్రల్లో ఉదయం 5.30 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2.10 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. నరసాపురం నుంచి మధ్యాహ్నం 2.50 గంటలకు బయల్దేరి రాత్రి 11.45 గంటలక చెన్నై సెంట్రల్కు చేరుకుంటుంది.

