
ఖరీఫ్ పంట 2025 కు రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో రాష్ట్ర వాటా 50% సమానమైన వాటాను ముందస్తు ప్రీమియం సబ్సిడీగా చెల్లించడానికి పంట బీమా పథకాలను సకాలంలో అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 132 కోట్ల 58 లక్షల నిధులు విడుదలు చేసింది. దీంతో రైతులు సకాలంలో పంట బీమా సౌలభ్యం పొందగలుగుతారు. ఈ పథకం కింద ఖరీఫ్ పంటలకు రైతులు కేవలం 2 శాతం ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.