ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. శనివారం రోజున కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 27 నాటికి అల్పపీడనం ఏర్పడనుందని అల్పపీడన ప్రభావంతో ఏపీలో రానున్న మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40-50కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.

