ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపించారు. 2025లో కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం చెందిందని విమర్శించారు. చిన్నారులు, మహిళలు, యువతులపై దౌర్జన్యాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. బెల్టు షాపులు, మద్యం దుకాణాలను విచ్చలవిడిగా నెలకొల్పి ప్రజల జీవితాలతో చెలగాటమాడాయని పేర్కొన్నారు. డీజీపీ విడుదల చేసిన వార్షిక నివేదికలో నేరాల సంఖ్య పెరిగిపోయాయని వెల్లడించడం ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ పనితీరును తెలియజేస్తుందని వెల్లడించారు.

