
ఆంధ్రప్రదేశ్లో ఎస్జీటీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పంది. వారికి మాన్యువల్గా కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అంగీకరించింది. పార్వతీపురం మన్యం జిల్లాలో నా క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం ప్రజాప్రతినిధులు, టిడిపి ఎమ్మెల్సీల తో ఎస్జీటీ కౌన్సెలింగ్పై చర్చించాం. ఉపాధ్యాయుల అభిప్రాయాలను ఎమ్మెల్సీలు నాకు తెలియజేశారు. వారి విజ్ఞప్తి మేరకు ఎస్జీటీలకు ఆన్లైన్ కౌన్సెలింగ్ బదులుగా మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించాం. అని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.