
సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో 21 అంశాల మీద మంత్రివర్గం చర్చించింది. అనంతరం పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ (లిఫ్ట్) పాలసీ 2024-29 అనుబంధ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జలవనరుల శాఖకు సంబంధించి పలు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రూ.15000 ఆర్థిక సాయం,కారవాన్ పర్యటకానికి, అమృత్ పథకం 2.0 పనులకు, ఆమోదం తెలిపింది.