పశ్చిమబెంగాల్లో ఎస్ఐఆర్ పక్రియలో న్యాయాధికారులను అనుమానించడంపై సుప్రీంకోర్టు మంగళవారంనాడు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థపై అనుమానాలు వద్దని, న్యాయాధికారులు ఓవర్ టైం పనిచేసి ఓటర్ల జాబితాను పరిశీలిస్తుంటే వారిపై అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదని సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. తొలిగించిన ఓటర్లకు సంబంధించిన కేసులను పరిశీలించేందుకు న్యాయాధికారులు ఓవర్ టైమ్ పనిచేస్తున్నారు. వారిని అనుమానించే చర్యలను సహించేది లేదు’ అని అన్నారు.

