మరికొన్నిరోజుల్లో 2025 ముగియబోతోంది. ఇయర్ ఎండింగ్ సందర్భంగా గూగుల్ తన “ఇయర్ ఇన్ సెర్చ్ 2025” పేరుతో నివేదిక విడుదల చేసింది. ఇందులో 2025లో భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రాంతాలను లిస్ట్ చేసింది. ఈ జాబితాలో మహాకుంభమేళా అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత ఫిలిప్పీన్స్, జార్జియా, మారిషస్, మాల్దీవులతోపాటు దేశీయంగా కశ్మీర్, సోమనాథ్, పాండిచ్చేరి ప్రాంతాలను ఎక్కువ మంది సెర్చ్ చేశారు.

