భారత మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ పసిడి పంచ్ విసిరింది. విశ్వవేదికపై తన పంచ్ పవర్ చూపించిన ఇందూరు బిడ్డ దేశానికి ఐదో బంగారు పతకం అందించింది. వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో చెలరేగిపోయిన నిఖత్ 51 కిలోల విభాగంలో ప్రత్యర్ధి గ్జువాన్ యూ గువో (Xuan Yi Guo)ను మట్టికరిపించి విజేతగా నిలిచింది. పారిస్ ఒలింపిక్స్లో నిరాశపరిచిన తను.. ఇప్పుడు యావత్ దేశం, తెలంగాణ రాష్ట్రం గర్వపడే విజయం సాధించింది.

