
ఇంజినీరింగ్ విద్యార్థినిని క్లాస్మేట్ అత్యాచారం చేశాడు.ఆమె రూమ్కు వెళ్లి మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ సంఘటన జరిగింది. ఇతర రాష్ట్రానికి చెందిన మహిళ కోల్కతాలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్నది. బెంగాల్లోని మెడికల్ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన తర్వాత ఈ కేసు వెలుగులోకి రావడం కలకలం రేపింది.