
అమెజాన్ ఇండియా, ఫ్లిప్కార్ట్, యూబయ్ ఇండియా, ఎట్సీ, ది ఫ్లాగ్ కంపెనీ, ది ఫ్లాగ్ కార్పొరేషన్ వంటి ప్రధాన ఇ-కామర్స్ సంస్థలకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. పాకిస్థాన్ జాతీయ జెండాలు, సంబంధిత వస్తువుల అమ్మకాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటివి చేయడం అంటే దేశ చట్టాలను ఉల్లంఘించడమేనని మండిపడింది. వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించింది. ఇ- కామర్స్ ప్లాట్ఫామ్ల్లో పాకిస్తానీ జాతీయ జెండాలు, పాకిస్థాన్ దేశ ముద్ర ఉన్న వస్తువుల అమ్మకాల పై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.