ఆంధ్రప్రదేశ్ లో బిజెపిని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతానని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పి.వి.ఎన్ మాధవ్ తెలిపారు. పదవి అనేది గొప్పస్థానం కాదని, అదొక బాధ్యత అని అన్నారు. ఈ సందర్భంగా విజయవాడ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కార్యకర్త గర్వపడేలా బిజెపిని తీర్చిదిద్దుతానని తెలియజేశారు. అందరితో కలిసి బిజెపిని బలంగా మారుస్తాం అని మాధవ్ పేర్కొన్నారు.

