అమెరికాలో అదృశ్యమైన భారత సంతతీకి చెందిన నలుగురు సీనియర్ సిటిజన్లు మృతి చెందారు. పశ్చిమ వర్జీనియాలోని ఓ ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్లున్న వాళ్ల కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. జూలై 29న వీరి వాహనం అదృశ్యం అయింది. పెన్సిల్వేనియాలోని బర్గర్కింగ్ రెస్టారెంట్లో వీరి వాహనం చివరిసారిగా కనిపించింది. అక్కడే వాళ్లు చివరిసారిగా క్రెడిట్ కార్డును ఉపయోగించినట్లు తెలిసింది. వీరి ఆచూకీ కోసం పోలీసులు హెలికాఫ్టర్లు కూడా ఉపయోగించారు. కాగా.. ఆగస్టు 2 రాత్రి వాహనాన్ని పోలీసులు గుర్తించారు.

