అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు ఆరోగ్య సమస్యలతో బాధపడేవారిపై దృష్టి సారించింది. ముఖ్యంగా డయాబెటిస్, ఒబెసిటీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి వీసాలు ఇవ్వకూడదని నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ఎంబసీలు మరియు కాన్సులర్ కార్యాలయాలకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ‘‘వలసదారుల ఆరోగ్య పరిస్థితి ప్రభుత్వం మీద ఆర్థిక భారంగా మారకూడదు’’ అనే ఉద్దేశంతోనే ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

