ఏపీ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ లోక్ సభలో బిల్లు ఆమోదం పొందిన అనంతరం రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. జిల్లాల సంఖ్య 28కి పెరిగింది. పరిపాలనా సౌలభ్యం కోసం మ్యాప్ లో సైతం భారీ మార్పులు సంభవించాయి. రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ ప్రభుత్వం కొత్త మ్యాప్ ను విడుదల చేసింది. ఇటీవల ప్రకటించిన కొత్త జిల్లాలు కూడా ఇందులో ఉన్నాయి. రాష్ట్ర రాజధానిగా అమరావతి అని స్పష్టంగా పేర్కొంది.

