హర్మూజ్ జలసంధిపై ప్రయాణిస్తున్న అత్యంత విలువైన అమెరికా నిఘా డ్రోన్ అకస్మాత్తుగా అదృశ్యం కావడం కలకలానికి దారి తీసింది. అత్యంత ఖరీదైనదిగా పేరున్న ఎంక్యూ-4సి ట్రైటన్ శుక్రవారంనాడు హర్మూజ్ గగనతలంలో కనిపించకుండా పోయింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి పర్షియన్ గల్ఫ్, హోర్ముజ్ జలాలపై నిఘా కోసం బయలుదేరిన డ్రోన్ ఈ డ్రోన్ మిషన్ తిరిగొస్తూ ఇరాన్ వైపు మళ్లింది. ఆ తరువాత కాసేపటికే ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ క్రమంలో కిందకు దిగిన డ్రోన్ రాడార్ స్క్రీన్లపై కనుమరుగైంది.

