వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. డ్రగ్స్ దందాలో దొరికిన కానిస్టేబుల్ ను తన గన్ మెన్ అంటూ టీడీపీ చేస్తున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. ఆ కానిస్టేబుల్ ఇప్పుడు తన గన్మెన్ కాదని స్పష్టం చేశారు. పోలీసు శాఖలో పనిచేస్తూ తప్పు చేస్తూ దొరికిపోతే తనకు ఆపాదించడం కరెక్ట్ కాదని అన్నారు. టీడీపీకి, ఆ పార్టీ సోషల్ మీడియాకు ఎదుటివారిపై నిందలు వేయడం, బురదజల్లడం అలవాటుగా మారిందని విమర్శించారు.

