బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మొంథా తీరాన్ని తాకింది. కాకినాడ-మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం వద్ద తుపాను తీరాన్ని తాకిందని వాతావరణశాఖ తెలిపింది. గడిచిన ఆరుగంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో తీరం వైపుగా వచ్చిందని..కాకినాడకు 110 కిలోమీటర్లు, మంచిలీపట్నానికి 20 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు పేర్కొంది. తుపాను తీరం దాటుతున్న నేపథ్యంలో తీర ప్రాంతాల్లో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. తుపాను పూర్తిగా తీరం దాటేందుకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని వాతావరణశాఖ తెలిపింది.

