loader

ఏపీలో మద్యం ధరలు పెంపు . . .

ఏపీలో మద్యం ధరల పెంపు దిశగా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఎక్సైజ్ శాఖ ఈ మేరకు కొత్త ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలుస్తోంది. మద్యం లైసెన్సీలకు ఇచ్చే మార్జిన్ విషయంలో తీసుకున్న నిర్ణయాలతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వస్తున్నట్లు అధికారులు గుర్తిం చారు. దీంతో, ఈ నష్టం భర్తీకి ఎంపిక చేసిన మద్యం ధరలు పెంపు దిశగా కసరత్తు మొదలు పెట్టినట్లు సమాచారం. ఈ ధరల పెంపు పైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి !

ఈసారి అక్టోబర్ 31 తేదీన నరక చతుర్దశి, దీపావళి రెండూ కలిసి ఒకే రోజు వచ్చాయని.. ఉదయం పూట చతుర్దశి తిథి, మధ్యాహ్నం 3.40 నిమిషాల నుంచి అమావాస్య ప్రారంభం అవుతుందని పండితులు చెబుతున్నారు. అక్టోబర్ 31 గురువారం రాత్రి మొత్తం అమావాస్య వ్యాపించి ఉంటుంది. కాబట్టి ఆరోజున దీపావళి జరుపుకోవాలని తెలుపుతున్నారు.

తెలంగాణ నుంచి వచ్చిన ఐఏఎస్‌లకు పోస్టింగ్..

ఇటీవలే తెలంగాణ నుంచి ఏపీకి బదిలీపై వచ్చిన ఐఏఎస్ అధికారులకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి కాటా, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్‌లకు వివిధ శాఖల్లో ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. అయితే మరో ఐఏఎస్ ఆఫీసర్ రొనాల్డ్ రాస్‍‌కు ఇంకా పోస్టింగ్ ఇవ్వనట్లు తెలిసింది.

మీ జిల్లా వార్తలు , మీ నియోజక వర్గ వార్తలు , త్వరలో అందిస్తాము

ప్రస్తుతం జిల్లా వార్తలు లోకల్ న్యూస్ అందుబాటులో లేవు రాష్ట్ర వార్తలు మరియు ప్రధాన వార్తలు మాత్రమే అందిస్తున్నాము గమనించండి , లోకల్ న్యూస్ మీ జిల్లా వార్తలు , మీ నియోజక వర్గం వార్తలు , మీ గ్రామ వార్తలు త్వరలో అందిస్తాము

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON