ఏపీలో మద్యం ధరలు పెంపు . . .
ఏపీలో మద్యం ధరల పెంపు దిశగా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఎక్సైజ్ శాఖ ఈ మేరకు కొత్త ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలుస్తోంది. మద్యం లైసెన్సీలకు ఇచ్చే మార్జిన్ విషయంలో తీసుకున్న నిర్ణయాలతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వస్తున్నట్లు అధికారులు గుర్తిం చారు. దీంతో, ఈ నష్టం భర్తీకి ఎంపిక చేసిన మద్యం ధరలు పెంపు దిశగా కసరత్తు మొదలు పెట్టినట్లు సమాచారం. ఈ ధరల పెంపు పైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.