loader

స్పేడెక్స్‌ డాకింగ్‌ సక్సెస్‌

ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోసారి సత్తా చాటింది. నూతన ఏడాదిలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పర్‌మెంట్‌ (స్పేడెక్స్‌) విజయవంతమైంది. నింగిలో రెండు ఉపగ్రహాల అనుసంధానం విజయవంతంగా పూర్తయింది. ఈ మేరకు ఇస్రో ‘ఎక్స్‌’లో గురువారం వెల్లడించింది. ‘అంతరిక్ష చరిత్రలో భారత్‌ తన పేరును లిఖించుకున్నది.

హైదారాబాద్‌లో మల్టీ లెవల్ కారు పార్కింగ్ కాంప్లెక్స్..

హైదరాబాద్ నాంపల్లి పరిధిలో నిర్మించిన ఆటోమేటిక్ పార్కింగ్ సిస్టం వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానుంది. దీంతో నాంపల్లి పరిధిలో రోడ్డుపై పార్కింగ్ సమస్యలు పూర్తిగా తీరిపోనున్నాయి. ఈ పార్కింగ్‌ కాంప్లెక్స్‌ను 15 అంతస్తులు మేర,  దేశంలో ఇదే మొట్ట మొదటి అతిపెద్ద ఆటోమేటిక్ పార్కింగ్ కాంప్లెక్స్ కానుంది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో సుమారు రూ.80 కోట్లు వెచ్చించి నిర్మాణం చేపట్టారు. మెస్సర్స్ భారీ ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ప్రాజెక్టును నిర్మించింది. దేశంలోనే తొలిసారిగా జర్మన్ […]

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబరాలు..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిల్లీ నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ, మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా.. సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి.. వేడుకల్లో భాగంగా ఆయన ఇంటి ప్రాంగణాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. అతిథులకు రుచి చూపించేందుకు పలు రకాల సంప్రదాయ వంటకాలను సిద్ధం చేశారు.

గుకేశ్ కు ఎలాన్ మ‌స్క్ అభినంద‌న‌లు . . .

భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ను ఎలాన్ మ‌స్క్ అభినంద‌న‌లు తెలిపారు. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన విష‌యం తెలిసిందే. చైనాకు చెందిన డింగ్‌ లిరెన్‌ను ఓడించి గుకేశ్ ప్రపంచ ఛాంపియన్ గా అవ‌త‌రించాడు. 18 ఏళ్లకే ఇలా వ‌ర‌ల్డ్ చెస్ ఛాంపియ‌న్‌గా నిలిచాడు. త‌ద్వారా ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన (18ఏళ్ల 8నెలల 14రోజులు) ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు . . .

ఐపీఎల్ రిటెన్షన్ జాబితాలు వచ్చేశాయి. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు జట్లు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలను ఆయా ఫ్రాంచైజీలు నేడు ప్రకటించాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సాధ్యమైనంత వరకు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ జట్టు కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ (18 కోట్లు), అభిషేక్‌ శర్మ (14 కోట్లు), నితీశ్‌కుమార్‌ రెడ్డి (6 కోట్లు), హెన్రిచ్‌ క్లాసెన్‌ (23 కోట్లు), ట్రవిస్‌ హెడ్‌ (14 కోట్లు) మరోసారి రిటైన్‌ చేసుకుంది.

లైసెన్స్‌డ్‌ షాపుల్లోనే క్రాకర్స్‌ కొనండి

తెలంగాణ వ్యాప్తంగా దీపావళికి పటాకులు విక్రయించేందుకు 6,953 దరఖాస్తులు రాగా 6,104 దుకాణాలకు అనుమతి ఇచ్చినట్టు అగ్నిమాపకశాఖ ఏడీజీ నాగిరెడ్డి తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగితే 101కు, ఫైర్‌ కంట్రోల్‌ ఆఫీసు 9949 991101కు కాల్‌ చేయాలని కోరారు. హైదరాబాద్‌వాసు లు 8712699170, 8712699176కు, మేడ్చల్‌మలాజిగిరి 8712699165, 871 2699168కు, రంగారెడ్డివాసులు 87126 99160, 8712699163, 87126858 08కు కాల్‌ చేయాలని సూచించారు.

ఏఎన్నార్‌ జాతీయ పురస్కారం అందుకున్న చిరంజీవి

ANR National Award 2024-అన్నపూర్ణ స్టూడియోలో 2024కి గాను ఏఎన్నార్‌ జాతీయ పురస్కారాల వేడుకల కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి ని శాలువాతో సత్కరించి.. అక్కినేని జాతీయ అవార్డు ప్రదానం చేశారు అమితాబ్‌ బచ్చన్‌.

దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి !

ఈసారి అక్టోబర్ 31 తేదీన నరక చతుర్దశి, దీపావళి రెండూ కలిసి ఒకే రోజు వచ్చాయని.. ఉదయం పూట చతుర్దశి తిథి, మధ్యాహ్నం 3.40 నిమిషాల నుంచి అమావాస్య ప్రారంభం అవుతుందని పండితులు చెబుతున్నారు. అక్టోబర్ 31 గురువారం రాత్రి మొత్తం అమావాస్య వ్యాపించి ఉంటుంది. కాబట్టి ఆరోజున దీపావళి జరుపుకోవాలని తెలుపుతున్నారు.

ఆక్రమణదారుల గుండెల్లో ‘హైడ్రా’ దడ . . .

వారం రోజులుగా హైడ్రా అధికారులు గండిపేట చెరువు సమీపంలోని ఖానాపూర్‌ గ్రామ రెవెన్యూ పరిధిలో పర్యటించి.. దాదాపు పది అక్రమ నిర్మాణాలను గుర్తించారు. నిర్మాణదారులకు ముందస్తుగా నోటీసులు జారీ చేసినా.. వారి నుంచి నిర్దేశించిన సమయంలో ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆదివారం రెండు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు.

మెడికల్‌ అడ్మిషన్లు, సౌకర్యాల పర్యవేక్షణకు టాస్క్‌ఫోర్స్‌

రాష్ట్రంలో వైద్యవిద్య ప్రవేశాలు, దవాఖానల్లో వసతుల కల్పనను పర్యవేక్షించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తూ ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌చోంగ్తు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. టాస్క్‌ఫోర్స్‌లో డీఎంఈ సభ్యకార్యదర్శిగా , డీఎంఈ(అకడమిక్‌), హెల్త్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌, ఉస్మానియా, గాంధీ మెడికల్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లు సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, పీజీ సీట్ల అడ్మిషన్ల ప్రక్రియను టాస్క్‌ఫోర్స్‌ పర్యవేక్షించనున్నది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON