తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ప్రకటించిన రెండో విడత ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే సుప్రీంకోర్టులో సోమవారంనాడు పిటిషన్ వేసింది. డీఎంకే ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆర్ఎస్ భారతి ఈ పిటిషన్ను డీఎంకే ఎంపీ, సీనియర్ అడ్వకేట్ ఎన్ఆర్ ఇలాంగో ద్వారా సుప్రీంకోర్టులో వేశారు. తమిళనాడులో ఎస్ఐఆర్ నిర్వహిస్తామంటూ అక్టోబర్ 27న ఈసీఐ ఇచ్చిన నోటిఫికేషన్ను కొట్టి వేయాలని ఆ పిటిషన్లో కోరారు.

