భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందంతో దేశ భవిష్యత్ను ప్రధాని నరేంద్ర మోదీ తాకట్టు పెట్టారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ ఒప్పందం వల్ల దేశ రైతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆక్షేపించారు. కేరళలోని కన్నూర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ, బీజేపీకి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF)కి మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు. ఆ రెండింటితో కాంగ్రెస్ నేతృత్వంలోని UDF పోరాడుతోందని వెల్లడించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో LDF గెలవాలని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు.

