
దేశవ్యాప్తంగా కొత్త GST శ్లాబులు అమలులోకి వచ్చిన తర్వాత, వినియోగదారులకు తక్షణ ప్రయోజనం అందకపోవడం వివాదంగా మారింది. కొన్ని ప్రముఖ ఇ-కామర్స్ సైట్లు ఉత్పత్తుల ధరల్లో తగ్గింపులను ప్రతిబింబించకపోవడం వల్ల కేంద్రానికి అనేక ఫిర్యాదులు చేరుకున్నాయి. వినియోగదారులు తక్కువ GST చెల్లించినప్పటికీ, ఆ లాభం ధరల్లో కనిపించకపోవడం అసంతృప్తికి దారితీస్తోంది. ఈ ఫిర్యాదులను కేంద్ర ప్రభుత్వం గమనించి ఆరా తీస్తోందని అధికారిక వర్గాలు వెల్లడించాయి..